Friday, May 8, 2009

ఇంత బాధ్యతా రాహిత్యమా?

సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఓ పెద్ద కుట్ర అని, అది వైఎస్ ఫ్యాక్షనిజానికి నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి... అవన్నీ పక్కన పెడితే.... అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారో... తెలియజెప్పే విషయం ఒకటి బయటపడింది.
ఏ కంపెనీలో అయినా, చిన్న ఆఫీసు అయినా... ఎంత చిన్న ప్రమాదం అయినా మనం వెంటనే స్పందిస్తాం. అది మనిషి సాధారణ స్పందన. అటువంటిది సచివాలయంలో, అది కూడా అన్ని జాగ్రత్తలు ఇది ఓ పత్రకలో వచ్చింది.



‘‘ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనానికి ఇద్దరమూ వెళ్లాం. తొలుత పొగ వస్తుండటంతో చిన్న ప్రమాదమని భావించి తలుపు దగ్గరగా పెట్టి భోజనం చేశాము. ఆ తరువాత తలుపు తీయడానికి వెళ్లగా పొగ ఎక్కువైంది. మంటలు లేచాయి. ఊపిరాడటానికి ఇబ్బందిగా మారింది. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాం. ఏమి జరుగుతోందో అర్థంకాలేదు. అప్పుడే ఓ కానిస్టేబుల్‌ అద్దాలు పగులగొట్టి కాపాడాడు.’’

శ్రీమన్నారాయణ, అమర్‌.. సచివాలయం ఉద్యోగులు. పొగలు వస్తున్నపుడు ఏం జరిగిందో చూడాలన్న మినిమమ్ సెన్స్ లేకుండా... తాపీగా భోజనం చేశారట.. ఇటువంటి ఉద్యోగులు, బద్దకస్తులు మన అధికారులు. ఏం చేస్తాం కానీయండి.!

1 comment:

శరత్ కాలమ్ said...

ఈ వార్త గనుక నిజమే అయితే వారిద్దరినీ కాపాడిన కానిస్టేబుల్ దే తప్పు. వారి ఖర్మానికి వాళ్ళని వదిలేయాల్సివుండింది. అప్పుడు బాగా బుద్ధివచ్చేది వారిద్దరికీ.